యాదాద్రి భువనగిరి : లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్షపుష్పార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తుల ను పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాలు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకస్వాములు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధరకాల పుష్పాలతో లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. విశేష పూజా కైంకర్యాలను దేవస్థాన ప్రధానార్చకుల ఆధ్వర్యంలో అర్చకబృందం నిర్వహించింది. కాగా, యాదాద్రీశుడి సన్నిధి లో లక్ష్మీనృసింహుడికి నిత్యోత్సవాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. ఉద యం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన ఆచార్యులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. నిజాభిషేకం, నిత్యార్చనలు, హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం