గోవిందరావుపేట, ఫిబ్రవరి 18: ములుగు జిల్లా గోవిందరావు పేటలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరం సందర్శనను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర సం దర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని చెప్పారు. ఈ క్రమంలో ట్రా ఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున 26 వరకు లక్నవరం సందర్శనను నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు.