హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని శామీర్పేటలో అక్రమంగా ఔషధాలు తయారుచేస్తున్న ఓ ప్రైవేట్ ల్యాబ్పై మంగళవారం డ్రగ్ కంట్రో ల్ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడు ల్లో రూ.5.5 లక్షల విలువైన అక్రమ ఔషధలను సీజ్ చేశారు. శామీర్పేటలో బయోటెక్ పార్క్లోని అస్పెన్ బయోఫార్మ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై 2023 మార్చిలో డీసీఏ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ‘గుడ్ మానిఫ్యాక్షరింగ్ ప్రాక్టీస్’ (ఔషధ తయారీలో నాణ్యతకు సంబంధించి) నియమాలు పాటించకపోవడం, డ్రగ్ అండ్ కాస్మోటిక్ చట్టం నియమా లు పాటించడం లేదని తేలింది. ఇకపై ఎలాంటి ఔషధాలను ఉత్పత్తి చేయొద్దని, మందులపై ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించొద్దని డీసీఏ ఆధికారులు ఆదేశాలు జారీచేశారు. కానీ, ‘సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్’, ‘గటిఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్’ను తయారుచేసినట్టు డ్రగ్ కం ట్రోల్ అథారిటీ డీజీ కమలాసన్రెడ్డి తెలిపారు.