ఇంఫాల్: మణిపూర్లో నాగాల నిరసన హింసాత్మకంగా మారింది. భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Naga protest turns violent) మే 13న కాంగ్పోక్పి జిల్లా నుంచి కిడ్నాపైన ఆరుగురు నాగా పౌరులు నెల తర్వాత హత్యకు గురయ్యారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యల కోసం డిమాండ్ చేస్తూ యునైటెడ్ నాగ కౌన్సిల్ (యూఎన్సీ) ఆధ్వర్యంలో గురువారం కాంగ్లాటొంగ్బిలో శాంతియుతంగా చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. గుంపును చెదరగొట్టేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించారు.
కాగా, ఈ సంఘటనలో నలుగురు నిరసనకారులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఇంఫాల్లోని ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాంగ్లాటోంగ్బి, దాని పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించారు.
మరోవైపు శాంతియుతంగా నిరసన చేస్తున్న నాగా నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించడంపై నాగ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్), లియాంగ్మై నాగా కౌన్సిల్ (ఎల్ఎన్సీ-ఎం) ఖండించాయి. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరుపాలని, గాయపడిన వారికి తగిన వైద్య సహాయం అందించాలని, అదుపులోకి తీసుకున్న గ్రామస్థులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. యూఎన్సీ చార్టర్ కింద ఉన్న అన్ని డిమాండ్లు నెరవేరే వరకు తమ ప్రజాస్వామ్య ఆందోళన కొనసాగిస్తామని నాగా కౌన్సిల్ పునరుద్ఘాటించింది.
Excessive use of force by security forces (mainly state forces as seen in video footage) leaves many peaceful protestors seriously injured at Kanglatongbi. 4 seriously injured are admitted at JNIMS Imphal. Indigenous Communities of Manipur demands for justice of 6 naga brothers… pic.twitter.com/Bg2aoOkNzt
— Paul Chawang (@paul_chawang) August 20, 2026