మహబూబ్ నగర్ : జిల్లా పరిధిలోని చిన్న చింతకుంట మండలంలోని పేదల తిరుపతి శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘటమైన ఉద్దాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పల్లమర్రి గ్రామం నుండి ఉద్దాల్ ( చాట ) బయలుదేరి నెల్లికోండి గ్రామం మీదుగా వడ్డేమాన్ గ్రామానికి చేరుకున్నాయి. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం అక్కడ్నుంచి ఊకచెట్టు వాగుపై తిర్మలాపూర్ గ్రామం మీదుగా శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి జాతర మైదానానికి సాయంత్రం వరకు చేరుకుంటాయి.
ఈ ఉత్సవాలను చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటారు. దారి పొడువునా ఆయా గ్రామాల్లో భక్తులు దర్శించుకుని ఊరేగింపులో పాల్గొంటారు. ఆలయం వద్దకు చేరుకోగానే ప్రత్యేక పూజల అనంతరం ఉద్దాలను గుట్టపైకి తీసుకెళ్తారు. భక్తుల సందర్శనార్థం అక్కడ ఉంచుతారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్, నారాయణపేట డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.