పోచమ్మమైదాన్, మార్చి 24 : వరంగల్ విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ కుప్పా పద్మజ(58) కన్నుమూశారు. గురువారం రాత్రి ఆమె ఇంట్లో గుండెపోటుకుగురై తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నాట్యగురువు వెంపటి నాగేశ్వరి వద్ద పద్మజ కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు. 1992 నుంచి వరంగల్లోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో అసిస్టెంట్ లెక్చరర్గా పనిచేశారు.
అనంతరం ఐదు సంవత్సరాలపాటు ఇన్చార్జి ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టారు. అనేక అవార్డులు సాధించారు. వరంగల్, హైదరాబాద్ దూరదర్శన్లో పలు నృత్య ప్రదర్శనలిచ్చారు. పద్మజ మృతి కళాలోకానికి తీరని లోటు అని పలువురు కళాకారులు, శిష్యులు పేర్కొన్నారు.