హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : మలేషియాలోని కౌలాలంపూర్లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అసోసియేషన్ ఏర్పడి పదేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం ఈ ఉత్సవాలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, గుజ్జ యుగంధర్రావు, చింతల వెంకటేశ్వర్రెడ్డి, రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి పాల్గొన్నారు.