హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): సాగునీటి పారుదల రంగంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర గర్వించే విజయాలను సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. తెలంగాణ సాధించిన విజయాలు.. నదికే నడక నేర్పిన ధీరోదాత్తమైన నాయకత్వం.. అంటూ వ్యాఖ్యానించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాగునీటి దినోత్సవం సందర్భంగా సాగునీటి రంగంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.జలదృశ్యం నుంచి.. సుజల దృశ్యం దాకా తెలంగాణ జల విధానం మన భారతదేశానికే కాదు యావత్తు ప్రపంచానికే ఆదర్శం
నాడు..
ఉమ్మడి పాలనలో తెలంగాణ వ్యవసాయ రంగంలో సంక్షోభం రైతన్నల బతుకు అత్యంత దుర్భరం
నేడు..
ఒకే ఒకడి సంకల్పంతో..సాగునీటి రంగంలో స్వర్ణయుగం
నాడు
నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నడు దాశరథి
నేడు
నా తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసిండు కేసీఆర్!
నదికే నడక నేర్పిన..ధీరోదాత్తమైన నాయకత్వం..
జీవం కోల్పోయిన గోదావరికి ప్రాణం పోసిన చారిత్రక సందర్భం..విశ్వ వేదికపై మెరిసిన మానవ నిర్మిత అద్భుతం..చుక నీటి కోసం అల్లాడిన నేలకు ప్రతి నిత్యం జలాభిషేకం..ఒక కాళేశ్వరం..దగాపడ్డ ప్రతి రైతు బిడ్డకు వచ్చే వందేళ్ల వరకూ తిరుగులేని అభయం ప్రతిపక్షాలు కుట్రలెన్ని పన్నినా కేంద్రం నీటి వాటాలు తేల్చకున్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణంలోనూ మెరుపు వేగం అతి త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా సాకారం చిన్న నీటి పారుదల రంగానికీ పెద్ద పీట వేసిన ఏకైక రాష్ట్రం..
మన తెలంగాణ.‘ఈ జల విజయంలో సీఎం కేసీఆర్ గారి సారథ్యంలో కాలంతో పోటీపడి కదం తొకిన.. జై కిసాన్ నినాదాన్ని నిజం చేసిన..ఇంజనీర్లకు, శ్రామికులకు, నీటి పారుదల శాఖ ఉద్యోగులకు, పాలు పంచుకున్న ప్రతి ఒకరికీ.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.