రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఉజ్వల భవిష్యత్తును భరోసా ఇచ్చే పెద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ఆగస్టు 15 నుంచి అర్హులైన మరో 10 లక్షల మంది కొత్తవాళ్లకు రూ.2,016 చొప్పున పెన్షన్లు ఇవ్వబోతున్నాం. అన్ని రంగాల్లో మహిళలకు సరైన అవకాశాలు దకేలా, వారి ఆత్మైస్థెర్యం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ఎల్లవేళలా సోదరికి అండగా నిలుస్తానని సోదరుడు చేసే ప్రమాణానికి ప్రతీకే రక్షాబంధన్ అని టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఉజ్వల భవిష్యత్తును భరోసా ఇచ్చే పెద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన చెప్పారు. రాఖీ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆడబిడ్డలంతా రాఖీకట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాఖీ పండుగను పురసరించుకొని 33 జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో జూమ్కాల్ ద్వారా ఆయన మాట్లాడారు.
మహిళా సంక్షేమంతోనే సమాజ పురోగతి సాధ్యమని నమ్ముతున్న ప్రభుత్వం తమదని ఆయన అన్నారు. మహిళల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రూ.200 ఉన్న పింఛన్ను సీఎం కేసీఆర్ పెద్దమనసుతో పదిరెట్లు పెరిగాయని తెలిపారు. 14 లక్షలమంది ఒంటరి, వితంతు మహిళలతోపాటు 4 లక్షలమంది మహిళా బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు అందిస్తున్న నాయకుడు కేసీఆర్ అని ఆయన చెప్పారు. ఈ ఆగస్టు 15 నుంచి అర్హులైన మరో 10 లక్షలమంది కొత్తవాళ్లకు రూ.2,016 చొప్పున పెన్షన్లు ఇవ్వబోతున్నట్టు ఆయన వెల్లడించారు. అన్ని రంగాల్లో మహిళలకు సరైన అవకాశాలు దకేలా, వారి ఆత్మైస్థెర్యం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అమ్మఒడి పథకంలో భాగంగా గర్భిణుల కోసం ప్రత్యేకంగా 300 ఆంబులెన్స్లు ఏర్పాటు చేశామని, వాటిద్వారా ఇప్పటివరకు 10 లక్షల 85 వేల మంది గర్భిణులకు ప్రయోజనం కలిగిందని కేటీఆర్ చెప్పారు. ఇప్పటివరకు 13 లక్షల 30వేల మంది బాలింతలకు రూ.2 వేల విలువైన కేసీఆర్ కిట్లు అందజేశామన్నారు. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేల పారితోషికం ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా 5.18 లక్షల మంది శిశువులకు, 21.58 లక్షల మంది గర్భిణులకు, 18.96 లక్షల మంది బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలోని 4.3 లక్షల పైచిలుకు స్వయంసహాయక బృందాలకు వడ్డీలేని రుణాలను అందించి ఆర్థికంగా అండగా నిలిచామని చెప్పారు. కేంద్రం తన కోటా తగ్గించుకున్నా.. అంగన్వాడీ, ఆశా కార్యకర్తల జీతాలను పెంచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తల్లిదండ్రులకు ఆడబిడ్డల పెండ్లి భారం కాకూడదన్న ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఇప్పటివరకు 12 లక్షల 87 వేల 588 మంది వధువులకు రూ.1,00,116 పెండ్లికానుకగా అందించామని చెప్పారు.
స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. చట్టసభల్లోనూ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు తేవాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపిందని, కేంద్రం మాత్రం నేటికీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించలేదని ఆయన విమర్శించారు. మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే ఉద్దేశంతో వీ-హబ్ను ఏర్పాటు చేసినట్టు కేసీఆర్ వెల్లడించారు. మంత్రి కేటీఆర్తో జూమ్ సమావేశంలో సంభాషించిన పలువురు లబ్ధిదారులు సంతోషం వెలిబుచ్చారు. ప్రభుత్వ పథకాలు తమకు ఎలా ఉపయోగపడ్డాయో వివరిస్తూ పలువురు మహిళలు ఉద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసిఆర్కిట్ పథకాలు తమ జీవితాల్లో అత్యంత కీలకమైనవని పేరొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు వారు ధన్యవాదాలు తెలిపారు.