KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. 15 మంది ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించదా? అని మండిపడ్డారు. పూట గడవక ఓ ఆటోడ్రైవర్ ఆటోను ప్రజాభవన్ ముందే తగలబెట్టుకున్నా కనికరించరా? అని నిలదీశారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని, ప్రతి ఆటోడ్రైవర్ కుటుంబానికి రూ.10 వేలు ఆర్థికసాయం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం యథావిధిగా.. ‘ప్రజాపాలన తెస్తామని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం ప్రజావ్యతిరేకిగా మారిపోయింది. అనాలోచిత విధానాలతో, ఒక హామీ అమలుచేసే హడావుడిలో మరో వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న తీరు మీ పాలన వైఫల్యాన్ని కండ్లకు కడుతున్నది. అందుకు నిదర్శనమే.. రోజురోజుకూ తీవ్రమవుతున్న ఆటోడ్రైవర్ల సంక్షోభం. గత పదేండ్లు తెలంగాణలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉంటే.. మీ 55 రోజుల పరిపాలనలోనే అనేక వర్గాలు ఆగమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపేద బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారు. ఇంతకాలం చెమటోడ్చి తమ కుటుంబాలను పోషించుకున్న ఆటోడ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అన్నమో రామచంద్రా అంటూ ఆవేదన చెందుతున్నారు.
ఆటోలకు గిరాకీ లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక ఇటీవలి కాలంలో ఏకంగా 15 మంది ఆటోడ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే.. పరిస్థితి ఎంత చేజారిపోయిందో అర్థమైపోతున్నది. ఆటోలు ఎకే వాళ్లు లేక కుటుంబం గడవని పరిస్థితిని ఎదురొంటున్నారు. పిల్లల ఫీజులు ఎలా చెల్లించాలో అర్థంకాక మానసిక వేదన అనుభవిస్తున్నారు. కిరాయి ఆటోలు నడుపుకునే డ్రైవర్ల పరిస్థితి మరింత దుర్భరం. అద్దెకు తెచ్చిన ఆటో కిరాయి పైసలు కూడా రాకపోవడంతో.. ఇక బతుకు బండిని లాగేదెలా? అని లక్షల మంది ఆందోళనలో ఉన్నారు. అప్పు తెచ్చి ఆటోలు కొని నడుపుతున్న డ్రైవర్ల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే గురువారం ఒక గిరిజన ఆటోడ్రైవర్ సోదరుడు బేగంపేటలోని ప్రజాభవన్ ముందు తనకు ఇంతకాలం బువ్వపెట్టిన ఆటోను చేతులారా తగలబెట్టుకున్న సంఘటన చూసి రాష్ట్రంలోని ప్రతి ఒకరి గుండె బరువెకింది. ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలు దికుతోచని పరిస్థితిని ఎదురొంటున్నాయి. సమస్య తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలోనే మా పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీని వేశాం. ఆటోసంఘాలు, డ్రైవర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాం. వాటన్నంటినీ ఒక నివేదిక రూపంలో తయారుచేసి మా పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పంపించాం. కానీ ఇప్పటివరకు మీ ప్రభుత్వం దానిపై స్పందించిన పాపాన పోలేదు.
అన్నం పెట్టిన ఆటో ఆకలి మంటల్లో కాలిపోయిన ఉదంతాన్ని చూసిన తరువాతైనా.. పరిస్థితి తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, 6.50 లక్షల మంది ఆటోడ్రైవర్ల పక్షాన కోరుతున్నాను. మీ అనాలోచిత విధానాల వల్ల రెండు నెలలుగా ఉపాధి లేక రోడ్డున పడ్డ ఆటోడ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. అందుకే రాష్ట్రంలో ఉన్న ఆరున్నర లక్షల మంది డ్రైవర్లకు ప్రతి నెల రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. 15 మంది ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వం వెంటనే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాను.
ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్గాంధీ ఆటోలో ప్రయాణిస్తూ డ్రైవర్ల సమస్యలు తనకు తెలుసు అంటూ ఫొటోలకు పోజులిచ్చారు. ఆటోడ్రైవర్లతో సమావేశం పేరిట సీఎం రేవంత్రెడ్డి మీడియాలో వార్తలకు చూపిన తాపత్రయం, వారి సమస్య పరిషారానికి చూపలేదు. ఈ సమావేశం తర్వాత ఆటోడ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆటోడ్రైవర్లను విసృ్తతంగా వాడుకున్న కాంగ్రెస్ పార్టీ, తీరా గట్టెకాక వారి జీవితాలతో ఇలా చెలగాటమాడటం అత్యంత దుర్మార్గమైన చర్య. ప్రజాభవన్ అని పేరు మారిస్తే సరిపోదు. ఆచరణలో చిత్తశుద్ధి ఉంటేనే ప్రజలు హర్షిస్తారు. ప్రజల సమస్యలు విని పరిషరిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రజాభవన్ ముందే ఆటోకు ఒక డ్రైవర్ నిప్పుపెట్టుకున్నా.. సీఎం ఇప్పటివరకు స్పం దించకపోవడం దురదృష్టకరం. అందుకే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుక వినిపిస్తున్నాం. ఆటోడ్రైవర్లను అన్నివిధాలా ఆదుకోవాలని మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఆరున్నర లక్షల మంది ఆటోడ్రైవర్లతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ఆటోడ్రైవర్లకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం’ అని పేర్కొన్నారు.
‘ఇప్పటికే 7 వేల ఉద్యోగాలిచ్చాం.. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను మా మంత్రివర్గం తీసుకుంటుంది’ అన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ది తప్పుడు ప్రచారమని తిప్పికొట్టారు. ‘6,956 స్టాఫ్నర్సులు, 15,750 పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిచేసింది. ఎన్నికల కోడ్ కారణంగా ఫలితాలను విడుదల చేయలేకపోయాం. రిక్రూట్మెంట్తో ఏమాత్రం సంబంధం లేని కాంగ్రెస్ ప్రభుత్వం అంతా తామే చేశామని ప్రజలను మోసం చేయాలనుకుంటున్నది. మరి సిగ్గులేకుండా కొత్త సీఎం నోటి నుంచి ఇలాంటి అవాస్తవాలు మాట్లాడటం సిగ్గుచేటు. క్రెడిట్ కొట్టేయడంలో చోర్ కాంగ్రెస్ పార్టీకి ఇది మొదటిసారికాదు. చివరిది కూడా కాదు’ అని రేవంత్పై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.