రాజన్నసిరిసిల్ల : బీఆర్ఎస్(BRS) పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి(Sirisilla constituency) సమావేశం ఆదివారం సిరిసిల్లలో జరగనున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు సిరిసిల్లలో పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.