హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నడిబొడ్డున భారీ భవనాలు, నిర్మాణాలను కొన్ని నెలల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభిస్తారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. బుధవారం ట్విట్టర్లో నిర్మాణంంలో ఉన్న సచివాలయం ఫొటోలను ట్వీట్ చేశారు. సచి వాలయం, భారీ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నాలను సీఎం ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి కీలకమైన సచివాలయాన్ని భద్రత, సౌకర్యాలపరంగా ఆధునికంగా ఉండేలా నిర్మాణాన్ని చేపట్టారు. పనులు తుదిదశకు చేరుకున్నాయి. మరో శతాబ్దంపాటు రాష్ట్ర అవసరాలు తీరేలా నిర్మాణాన్ని డిజైన్ చేశారు. భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లో నిర్మిస్తున్నారు. దసరా కల్లా భవనాన్ని సిద్ధం చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మూడు షిప్ట్ల్లో మూడు వేల మందికిపైగా నిర్మాణ రంగ నిపుణులు, కార్మికులు శ్రమిస్తున్నారు.
స్థలం: 29.5 ఎకరాలు
అంచనా వ్యయం: రూ.617కోట్లు
నిర్మాణ విస్తీర్ణం: 7,00,000 చదరపు అడుగులు
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల స్మృతి జ్వలించేలా వారి స్ఫూర్తి పరిఢవిల్లే విధంగా హుస్సేన్సాగర్ తీరంలో అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మిస్తున్నారు. అమరవీరులకు అజరామర నివాళిని అర్పించాలనే ఉద్దేశంతో దీనిని నిర్మిస్తున్నారు. లుంబినీ పార్కు పక్కన, నూతన సచివాలయానికి ఎదురుగా భారీస్థాయిలో వెలుగు దివ్వె ఆకారంలో నిర్మిస్తున్నారు. స్తూపం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
స్థలం: 3.29 ఎకరాలు
నిర్మాణ విస్తీర్ణం 2.88 లక్షల చదరపు అడుగులు
అంచనా వ్యయం: రూ.150కోట్లు