హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉతంఠ పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతోపాటు ఎంఐఎం కూడా తనను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన వ్యంగ్యాస్త్రం సంధించారు.
‘ఒకే సమయంలో ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాపై ఆగ్రహంగా ఉన్నాయంటే.. మనం కచ్చితంగా ప్రజలపక్షాన సరైన, మంచి పనే చేస్తున్నామన్నమాట’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. దీనికితోడు ఆయన ఒక స్మైలీ ఎమోజీని కూడా జోడించారు. ముఖ్యంగా ఈ ట్వీట్లో ఆయన #POCSO అనే హ్యాష్ట్యాగ్ను వాడటం ప్రాధాన్యం సంతరించుకున్నది. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైంది. బీఆర్ఎస్ శ్రేణులు ఈ ట్వీట్ను రీ-ట్వీట్ చేస్తూ, కేటీఆర్ ఒంటరిగానే ముగ్గురు రాజకీయ ప్రత్యర్థులను సమర్థంగా ఎదురొంటున్నారని ప్రశంసిస్తున్నారు.