హైదరాబాద్ : దీక్షా దివస్(Deeksha Divas) సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలంగాణ భవన్లో రక్త దాన శిబిరాన్ని( Blood donation )బుధవారం ప్రారంభించారు. అనంతరం స్వయంగా రక్త దానం చేశారు. కాగా, అంతకు ముందు బీఆర్ఎస్ భవన్కు చేరుకున్న కేటీఆర్కు తెలంగాణ భవన్(Telangana Bhavan)లో దీక్షా దివస్ చేపట్టవద్దని ఎన్నికల స్క్వాడ్ అభ్యంతరం తెలిపింది. ప్రచారం గుడువు ముగిసినందున పార్టీ కార్యాలయాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించింది. అయితే దీక్షా దివస్ ఎన్నికల కార్యక్రమం కాదని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తామని తెలుపడంతో అందుకు ఎన్నికల అధికారులు అంగీకరించారు. దీంతో పెద్ద ఎత్తున కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు రక్తదానం చేశారు.
రక్తదానం చేస్తున్న కేటీఆర్
#WATCH | BRS leader KT Rama Rao donates blood during a blood donation camp organised at Telangana Bhawan in Hyderabad pic.twitter.com/pHcqVD1bp7
— ANI (@ANI) November 29, 2023