Yadadri | యాదాద్రి భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు బుధవారం సాయంత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హిమాన్షుతో పాటు అతని స్నేహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిమాన్షుకు ఆలయ వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు. యాదాద్రి ఆలయానికి చేరుకున్న హిమాన్షును ఆలయ పండితులు సాదరంగా ఆహ్వానించి, స్వామి వారి దర్శనం కల్పించారు.
ఇక యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చిన హిమాన్షు రావుకు యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.