హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పంప్హౌస్ సందర్శనకు హైదరాబాద్ నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం బయలు దేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ను నేడు పరిశీలించనున్నారు. వారి వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, ఒడితల సతీష్ కుమార్, చల్లా ధర్మారెడ్డి పార్టీ నాయకులు ఉన్నారు.
ఈ క్రమంలో భువనగిరి వివేరా హోటల్ వద్ద కేటీఆర్ ఆగారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చిన పూల మాలలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బూడిద బిక్షమయ్యగౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఉన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్హౌస్ సందర్శనకు హైదరాబాద్ నుండి బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం.
వారి వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి… pic.twitter.com/zyKSRdMrOX
— BRS Party (@BRSparty) July 5, 2026