హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై బాధ్యత మరచి కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ట రాజకీయాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజలకు కాళేశ్వరం గొప్పదనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూడటానికి, ఎండాకాలంలో ప్రజలు గొంతులు ఎండగా చూడటానికే తాము చలో మేడిగడ్డ పర్యటన చేపట్టామని తెలిపారు. తెలంగాణను మరోసారి ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ చలో మెడిగడ్డ పర్యటన సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమ మీద కోపాన్ని రైతుల మీద చూపించొద్దన్నారు.
ఎండుతున్న పంటలకు తక్షణమే నీరందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు ప్రయోజనం కాదు, రాజకీయ ప్రయోజనమే కాంగ్రెక్ కావాలని విమర్శించారు. నేడు తాము చేస్తున్న పర్యటన అనంతరం అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తామన్నారు. మరమ్మతులు చేయడానికి ఎందుకు ఇబ్బంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోండి. కానీ, రైతులను బలి చేయొద్దని సూచించారు. రిపేర్ చేయకుంటే వర్షాకాలంలో బరేజ్ కొట్టుకుపోతుందని చూస్తున్నారని ఆరోపించారు.
🔷 బాధ్యత మరచి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది
🔷 వాస్తవాలు చెప్పడానికే మా ఈ చలో మేడిగడ్డ పర్యటన
🔷 రైతు ప్రయోజనం ముఖ్యం కాదు రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి కావాలి
🔷 ఇవ్వాళ చేస్తున్న పర్యటన మొదటి పర్యటన మాత్రమే.. తర్వాత అన్ని ప్రాజెక్టు లు పర్యటిస్తాం
🔷 రిపేర్… pic.twitter.com/unK7NLzPPK
— BRS Party (@BRSparty) March 1, 2024