KTR | పెద్ద పెద్ద లీడర్లను తీసుకొచ్చి క్కడ కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిందని.. మార్పు తెస్తాం అంటూ ప్రచారం చేసిందని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు వ్యంగ్యస్త్రాలు సంధించారు. రెండేళ్ల క్రితం మైనార్టీల కోసం 4వేల కోట్ల బడ్జెట్ పెడతామన్నారనని.. మైనార్టీ సబ్ ప్లాన్ కూడా తెస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని.. రెండేళ్లు అయిపోయాయి.. ఇంకో మూడేళ్లలో కూడా వీళ్లు చేసేది ఏమీ ఉండదని కేటీఆర్ విమర్శించారు. శంషాబాద్లో బీఆర్ఎస్ మైనార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ షాదీ ముబారక్ వంటి పథకాన్ని ప్రవేశపెట్టారు.. షాదీ ముబారక్ కింద రూ.లక్ష ఇస్తే.. మేం అంతకంటే ఎక్కువ ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్కుగా చూస్తోందని ఆరోపించారు.
మైనార్టీ స్కూళ్లను కేసీఆర్ ప్రారంభించారని.. మైనార్టీ స్కూల్స్తో ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లు అవుతున్నారన్నారు. నాలుగు ఉన్న మెడికల్ కాలేజీలు కేసీఆర్ 34కు పెంచారాని.. విద్యార్థులకు 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చారని.. పదేళ్లలో ఎన్నో పనులు చేశారన్నారు. మేం కూడా కొన్ని కొన్ని పొరపాట్లు చేసి ఉంటే చేసుండొచ్చని.. కానీ.. ఇండియాలో మైనార్టీలకు కేసీఆర్ చేసినన్ని పనులు ఇంకెవరూ చేయలేదన్నారు. తెలంగాణలో 45 లక్షల మంది ముస్లింలు ఉన్నారని.. కేసీఆర్ హయాంలో ఒక్కొక్కరిపై రూ.5వేల ఖర్చు చేశారని. ఇది అన్ని రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ అని తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం అత్యధికంగా ఖర్చు చేసింది కేసీఆరేనని.. ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాల్లో అసదుద్దీన్ ఒవైసీ కూడా చెప్పారు.. కానీ ఇక్కడ చెప్పరన్నారు.
బుల్డోజర్ రాజ్యం నడవదని యూపీపై రాహుల్ గాంధీ విమర్శించారని.. ఇక్కడ అదే బుల్డోజర్ రాజ్యం నడుస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్గా ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. హైడ్రాపై రాహుల్ గాంధీ సైలెంట్గా ఉన్నారని.. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్తో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యే పార్టీ మారారని.. మీరు ఏ పార్టీలో ఉన్నారని వారిని అడగండి.. వాళ్లు సమాధానం చెప్పలేదన్నారు. ఇదే విషయంపై ఒకసారి జర్నలిస్టు కడియం శ్రీహరిని ప్రశ్నిస్తే.. ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా అని సమాధానం చెప్పారు.. ఇది వాళ్ల పరిస్థితి అంటూ గుర్తు చేశారు. సీఎం అవుతానని రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదని.. ఒక యువకుడు మంచి రీల్ చేశాడని.. ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి ఏం చేశారని అడిగితే.. ఆయన చేసింది ఒక్కటే కేసీఆర్ పేరు తీయడం.. కేసీఆర్ను గుర్తు చేసుకోవడం అంతేనన్నారు.
మోదీ స్కూల్లో చదివానని.. చంద్రబాబు కాలేజీకి వెళ్లానని.. రాహుల్ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని రేవంత్ బహిరంగంగానే చెబుతున్నారని.. చౌకీదార్ చోర్ అని రాహుల్ అంటే.. రేవంత్ రెడ్డి కాదు కాదు.. ఆయన నా పెద్దన్న అని చెబుతున్నాడన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు మోదీ జేబు సంస్థలు అని విమర్శిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తారని.. ఒక సంవత్సరం క్రితం పొంగులేటి ఇంటిపై ఈడీకి రైడ్స్ అయ్యాయని.. ఒకటి కాదు రెండు రోజులు రైడ్స్ అయ్యాయని గుర్తు చేశారు. నోట్లు లెక్కపెట్టే మెషిన్లను లోపలికి తీసుకెళ్లిన దృశ్యాలు అంతా చూశారని. అంత జరిగిన తర్వాత ఏమైంది.. ఏమీ కాలేదు.. అంతా సైలెంట్ అంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి బంధువుకు కేంద్రంలో కాంట్రాక్టులు వస్తాచయని.. బదులుగా రేవంత్ రెడ్డి కూడా బీజేపీ నేతకు లాభం చేకూరుస్తారనవి ఆరోపించారు.