ట్విట్టర్లో నిలదీసిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రధాని మోదీ పై విమర్శలు కురిపించారు. ఎనిమిదేండ్ల కిందట ‘అచ్చేదిన్’ (మంచి రోజులు) వస్తాయని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ.. ‘అచ్చేదిన్ ఇవేనా?’ అని నిలదీశారు.
‘ఎనిమిదేండ్ల కిందట సరిగ్గా ఇదే రోజు అచ్చేదిన్ వస్తాయని మీరు హామీ ఇచ్చారు. కానీ మీ ప్రభుత్వం ఏంచేసిందో తెలుసా..
డాలర్తో రూపాయి కనిష్ట విలువ రూ.77.60కు జారిపోయింది. 45 ఏండ్లలోనే అత్యధిక నిరుద్యోగిత శాతం నమోదైంది. ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్ఠానికి పెరిగింది. ప్రపంచంలోనే అత్యధిక ఎల్పీజీ ధరను వసూలు చేస్తున్నది. ఆర్థిక పరిస్థితి గత 42 ఏండ్లతో పోల్చితే అధ్వాన స్థితికి చేరింది. వెల్ డన్ సర్’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.