Minister KTR | యాదాద్రి భువనగిరి, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ‘మాది కోతల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. చేనేతల ప్రభుత్వం. రైతు రు ణమాఫీ అయితదా అని భ్రమపడ్డరు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రెండోసారి కూడా చేసి చూపించారు. చేనేత రుణమా ఫీ కూడా చేయాలని అడుగుతున్నరు. గతంలో ఓ సారి నేతన్నలకు రుణమాఫీ చేశాం. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. వంద శాతం చేస్తారనే విశ్వాసం ఉన్నది. వెంటనే అమలు చేసే ప్రయత్నం చేస్తం’ అని రాష్ట్ర చేనే త, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో శనివారం పలు అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూ నిట్ను ప్రారంభించారు. పోచంపల్లి హ్యాం డ్లూమ్ పార్కును సందర్శించారు. నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన చేనేత సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గుండెలను కండెలుగా చేసి.. చెమట చు క్కలను చీరెలుగా, పేగులను వస్ర్తాలుగా మార్చి నాగరికతను అద్దిన నేతన్నలకు శుభాకాంక్షలు అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నేతన్నలకు మన దగ్గర అద్భుతమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు.
100 శాతం చేనేత మాఫీపై విశ్వాసం ఉన్నది
‘కాంగ్రెసోళ్లు కరోనాతో రాష్ట్రం నష్టపోయిందని, సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీ చేయరని ఆశ పడ్డారు. సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు కాబ ట్టే రూ.19 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారు. ఇబ్బంది అయినా రెండోసారి బ్రహ్మాండంగా రుణమాఫీ చేశారు. గతంలో చేనేత రుణమాఫీ చేశాం. సంఘాలు, వ్యక్తిగత రుణాలు మాఫీ చే శాం. మళ్లొక్కసారి చేనేత రుణమాఫీ చేయాలని అడుగుతున్నరు. దీన్ని తప్పకుండా మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్తాం. సీఎం మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకునే మని షి కాబట్టి 100 శాతం చేస్తారనే విశ్వాసం ఉన్న ది. లెక్కలన్నీ తీసి.. ఎంత ఖర్చు వస్తదో చూసుకుని వెంటనే అమలు చేసే ప్రయత్నం చేస్తం’ అని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు.’
మూడోసారీ కేసీఆరే సీఎం
‘రానున్న అసెంబ్లీలో ఎన్నికల్లో తప్పకుండా మనమే గెలుస్తాం. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నంత కాలం చేనేతపై 5 శాతం జీఎస్టీని తీసేయరు. ఈసారి కేంద్రంలో కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది. బీఆర్ఎస్ బలం లేకుండా, మన ఆశీర్వాదం లే కుండా ఎవరూ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి లేదు. అందుకే కేంద్రంతో కొట్లాడేటోళ్లు కావా లె. కేంద్రాన్ని శాసించేటోళ్లు కావాలె. కేంద్రాన్ని శాసించే రోజులు రావాలి. కేంద్రం మెడలు వంచేటోళ్లు రావాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు పార్లమెంట్ స్థానాల్లో ఎవరిని నిలబెట్టినా తప్పకుండా గెలిపించుకోవాలి. పార్లమెంట్లో మన మాట నెగ్గించుకోవాలి. ఢిల్లీకి బానిసలు, కాంగ్రెస్ దద్దమ్మలు ఉన్నంత కాలం పరిస్థితులు మారవు. అందుకే ఎట్లయితే తెలంగాణ కోసం కొట్లాడి మెడలు వంచి రాష్ర్టాన్ని సాధించుకున్నమో అదే పద్ధతిలో వృత్తిని బాగు చేసుకోవాలంటే తప్పకుండా ఢిల్లీలో మన పార్టీ ఉండాలి. మన బాణి వినిపించే నాయకత్వం ఉండాలి. కేసీఆర్లాంటి దమ్ము, దక్షత కలిగిన నాయకుడు కేంద్రంలో ముఖ్య పాత్ర పోషించే పరిస్థితి రావాలి. దానికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
నేతన్నకు ప్రతి నెలా రూ.3 వేలు
‘చేనేత మిత్ర పేరుతో రసాయనాలు, నూ లుపై 50 శాతం సబ్సిడీ, నేతన్నకు చేయూత, రైతు బీమా తరహాలో నేతన్న బీమా పథకం అమలు చేస్తున్నామంటే అది ఒక్క కేసీఆర్తోనే సాధ్యమైంది. పథకాల అమలు కొంత గ్యాప్ ఉన్న నేపథ్యంలో వరుసగా రెండు, మూడు రో జులు సమీక్షలు, సమావేశాలు నిర్వహించాం. చేనేత మిత్రలో భాగంగా రసాయనాలు, నూలు పై సబ్సిడీలు కాస్త ఆలస్యం అవుతున్నది. ఇక నుంచి ఇబ్బంది లేకుండా నెలకు రూ.3 వేలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. ఇది వచ్చే నెల నుంచే అమల్లోకి వస్తుంది. ఇంటిగ్రేటెడ్ హ్యాం డ్లూమ్ యూనిట్ను పరిశీలిస్తే 60 ఏండ్ల పైబడిన కార్మికులు కనిపించారు. ఇప్పుడు నేతన్న బీమా పథకం 59 ఏండ్లకే ఉన్నది. దీన్ని 75 ఏండ్లకు పెంచుతాం. తద్వారా వేల మంది నేతన్నలకు లాభం చేకూరుతుంది. టర్మ్ ముగియనప్పటికీ ముందుగానే రూ.96 కోట్లను ప్రభు త్వం విడుదల చేసింది’ అని కేటీఆర్ చెప్పారు.
కేంద్రం అమ్ముతుంటే.. రాష్ట్రం కొంటున్నది
‘రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులను కాపాడే ప్రయత్నం చేస్తుంటే.. కేంద్రం ఐసీఐసీఐ లాం బార్డ్, ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆలిండియా పవర్లూమ్, ఆలిండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డుతోపాటు పలు సంస్థలను రద్దు చేసింది. కేంద్రం పనికొచ్చే ఏ పనీ చేయకుండా.. అన్నింటినీ రద్దు చేస్తూ పోతున్నది. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుంటే.. రాష్ట్ర ప్రభు త్వం కొంటున్నది. ఇటీవల పోచంపల్లి హ్యాం డ్లూం పార్కును కొనడమే ఇందుకు నిదర్శనం. 75 ఏండ్లలో ఏ ప్రభుత్వమూ, ఏ ప్రధానీ చేయ ని విధంగా మోదీ దుర్మార్గంగా చేనేతపై 5 శాతం జీఎస్టీ విధించారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా వేల సంఖ్యలో నేత కార్మికులు పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా జీఎస్టీని ఎత్తేయాలని కోరారు. ఇప్పటికే ఈ వృత్తి కునారిల్లిపోతున్నదని, అంతరించిపోతున్నదని సీఎం కేసీఆర్ లేఖలు రాశారు. అయినా మోదీ పట్టించుకున్న పాపాన పోలేదు’ అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లిం గయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లిం గయ్య, శానంపూడి సైదిరెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్ఎస్ నేతలు రాపోలు ఆనందభాస్కర్, కుంభం అనిల్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేత కార్మికులకు హెల్త్ కార్డులు
‘గతంలోఐసీఐసీఐ లాంబార్డ్ పథకం ఉండేది. దాన్ని ప్రధాని మోదీ రద్దు చేశారు. కేంద్రం అమలు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఔట్ పేషెంట్ సేవల కోసం తెలంగాణ చేనేత హెల్త్ కార్డులను తీసుకొచ్చి, రూ.25 వేలు ఇస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికంగా నేతన్నలు ఉండటంతో అధికారులు ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలి. గుంత మగ్గాలకు బదులు మగ్గాన్ని ఆధునీకరించుకుంటేనే బాగుంటుంది. ఇందుకోసం తెలంగాణ నేతన్న మగ్గం పథకాన్ని తీసుకొచ్చాం. అందుకు రూ.40 కోట్లు కేటాయించాం. అందరికీ ఫ్రేమ్ మగ్గాలు పంపిణీ చేస్తాం. అర్హులందరికీ కొత్తగా గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. దాని ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధి పొందవచ్చు. చేనేత హెల్త్ కార్డులను కూడా తీసుకొచ్చాం. గతంలో నేత కార్మికులు చనిపోతే దహన సంస్కారాలకు రూ.5 వేలు ఇచ్చేవారు. ఆ తక్షణ సాయాన్ని రూ.25 వేలకు పెంచాం. పోచంపల్లి యాదాద్రి జిల్లాకే పరిమితం కాకూడదు. దీన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఉప్పల్ భగాయత్లో నేతన్నల మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం’ అని కేటీఆర్ తెలిపారు.
‘నిజాం’లో మధుర జ్ఞాపకాలు
చారిత్రక నిజాం కాలేజీ స్టూడెంట్గా గర్వపడుతున్నానని, ఈ కాలేజీతో తనకు అనేక మధుర జ్ఞాపకాలున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. నిజాం కాలేజీ, ఉస్మానియా వర్సిటీ అభివృద్ధికి చేయగలిగినంత చేస్తానని హామీ ఇచ్చారు. రూ.18.75 కోట్లతో తలపెట్టిన నిజాం కాలేజీ బాలుర హాస్టల్, అదనపు తరగతి గ దుల నిర్మాణానికి శనివారం ఆయన సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ఎల్ రమణతో కలిసి శంకుస్థాపన చేశారు. విద్యాశాఖ నిధులకు అదనంగా రూ. 40.75 కోట్ల హెచ్ఎండీఏ నిధులను హాస్టళ్ల నిర్మాణానికి కేటాయించినట్టు చెప్పారు.