హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మె ల్యే కేటీఆర్కు మరో అరుదైన గౌరవం దకింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘తాల్ హాస్పిటల్స్ హెల్త్ఫెస్ట్ 2025’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని తాల్ హాస్పిటల్స్ సీఈవో సాయి గుండవెల్లి హైదరాబాద్లో మంగళవారం స్వయంగా కేటీఆర్కు అందజేశారు. అక్టోబర్ 24న కాలిఫోర్నియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్డియాగోలో ఈ ‘హెల్త్ ఫెస్ట్ 2025’ నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆవిషర్తలు, సంఘ సంస్కర్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణపై చర్చించడమే ఈ సదస్సు ముఖ్యఉద్దేశం. ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వ్యక్తిగత వైద్యం, డిజిటల్ హెల్త్కేర్ ఆవిషరణలు, సమీకృత వైద్య సంరక్షణ, ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలకు మార్గాలు వంటి అంశాలపై విసృ్తతంగా చర్చిస్తారు.
అంతర్జాతీయ ఫెస్ట్లో కేటీఆర్ కీలకోపన్యాసం
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. తెలంగాణలో టెక్నాలజీ ఆధారిత పాలన, ఆవిషరణలతో కూడిన అభివృద్ధి, ఆరోగ్య రం గంలో తీసుకొచ్చిన విధానాలు, ప్రపంచ ప్రజలకు ఎంతో విలువైనవిగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆహ్వానాన్ని కేటీఆర్ అంగీకరించినందుకు టచ్-ఏ-లైఫ్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలిపింది. ‘హెల్త్ ఫెస్ట్ 2025’లో ఆయన భాగస్వామ్యం ఈ వేదికపై అర్థవంతమైన చర్చలకు దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తంచేశారు. సాయి గుండవెల్లి వెంట ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ రవీందర్యాదవ్ ఉన్నారు.