మల్యాల, జూన్ 6 : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మ్యాడంపెల్లికి చెందిన తడగొండ గంగయ్య 20 రోజుల క్రితం సౌదీలో మృతిచెందగా, మంత్రి కేటీఆర్ చొరవతో మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరుకున్నది. గంగయ్య మృతదేహన్ని స్వదేశానికి తెప్పించేలా చూడాలని మల్యాల జడ్పీటీసీ రామ్మోహన్రావు, సర్పంచ్ గంగ మహేశ్వరికి కుటుంబ సభ్యులు విన్నవించడంతో వారు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరపడంతో గంగయ్య మృతదేహం శనివారం అర్ధరాత్రి హైదరాబాద్కు చేరుకున్నది. అక్కడి నుంచి స్వగ్రామానికి తరలించేందుకు రవాణాసౌకర్యం కల్పించారు. గ్రామానికి గంగయ్య మృతదేహం చేరుకోగా, కుటుంబీకులు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి కేటీఆర్ ఔదార్యం
కరోనా బాధితుడికి 2డీజీ సాచెట్స్
ఎల్లారెడ్డిపేట, జూన్ 6: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఔదార్యం చూపారు. కరోనాతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితుడికి 2డీజీ సాచెట్స్ పంపించారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన కస్తూరి రామచంద్రారెడ్డి కరోనాతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతనికి 2డీజీ సాచెట్స్ అవసరమని జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు తెలుసుకున్నారు. ఆదివారం ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే 2డీజీ సాచెట్స్ను సమకూర్చారు. వెంటనే స్పందించి సాయం చేసిన మంత్రి కేటీఆర్కు బాధిత కుటుంబ సభ్యులతోపాటు, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు కృతజ్ఞతలు తెలిపారు.