గిరిజన విద్యార్థి ట్వీట్కు స్పందన
నవాబ్పేట, సెప్టెంబర్ 7: ఇద్దరు చిన్నారుల కుటుంబ పరిస్థితి బాగోలేదని, వారిని ఆదుకోండి సార్.. ప్లీజ్ అంటూ ఓ విద్యార్థి చేసిన ట్వీట్కు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించి సాయం చేశారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం ఊరంచుతండాకు చెందిన జగన్, దేవి దంపతులకు చరణ్(11), మోహన్(6) ఇద్దరు కుమారులు. ఎనిమిది నెలల కిందట చిన్నా రుల తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి జగన్ వికలాంగుడు కావడంతో చిన్నారులను పోషించే పరిస్థితి లేదు. అదే తండాకు చెందిన విద్యార్థి రాజేశ్వర్ రాథోడ్.. చిన్నారుల దీనస్థితిని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. మంత్రి కేటీఆర్ వెంటనే చొరవ తీసుకోవడంతో కలెక్టర్ రంగంలోకి దిగి చిన్నారులకు దుస్తులు అందజేసి.. జిల్లా కేంద్రంలోని బాలసదనంలో చేర్పించారు.