హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడిత పాలన అని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజల వేదన అరణ్య రోదనగానే మిగిలిందని విమర్శించారు. రైతులను చెరబట్టారని, పేదల ఇండ్లు కూలగొట్టారని ధ్వజమెత్తారు. రైతుబంధు ఎత్తేశారని, రైతుభీమాకు పాతరేశారని, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ మాయం చేశారని, అమ్మవడిని ఆగం చేశారని దుయ్యబట్టారు.
నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని, ఏక్ పోలీస్ అన్న పోలీసులను అణగదొక్కారని చెప్పారు. హామీల అమలు అడిగిన ఆడబిడ్డలు, ఆశాలను అవమానించారని మండిపడ్డారు. టీఎస్ టీజీగా చేసి చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించారన్నారు. తెలంగాణ బిడ్డలు లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి ఆత్మబలిదానాలతో ఉద్యమిస్తున్నప్పుడు.. సమైక్యవాదుల పంచనచేరి వంచన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార అహంకారంతో ఇప్పుడు ఏకంగా అమ్మనే మార్చారని విమర్శించారు. చరిత్రను చెరిపేస్తామన్న భ్రమలో తెలంగాణ ప్రజలను ఏమారుస్తాం అనుకుంటే పొరపాటేనని చెప్పారు. తెలంగాణ అన్నీ గమనిస్తున్నది, కాలంబు రాగానే కాటేసి తీరుతుందన్నారు.
పాలన కాదు పీడన
ప్రజల వేదన
అరణ్య రోదనరైతుల చెరబడితిరి
పేదల ఇండ్లు కూలగొడ్తిరిరైతుబంధు ఎత్తేస్తిరి
రైతుభీమాకు పాతరేస్తిరికేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ మాయం చేస్తిరి ..
అమ్మవడిని ఆగం చేస్తిరినిరుద్యోగుల ఉసురు పోసుకుంటిరి
ఏక్ పోలీస్ అన్న పోలీసులను అణగదొక్కితిరిహామీల… pic.twitter.com/dMqAPFBg3s
— KTR (@KTRBRS) December 10, 2024