హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): పెట్రో రేట్లను సెస్సుల రూపంలో పెంచుతూ కేంద్రంలోని మోదీ సర్కారు ఆర్థిక దోపిడీకి పాల్పడుతూ రాష్ట్రాల హకులను కబళిస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. సెస్సుల ఆదాయాన్ని మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించకుండా, తమ సొంత రాజకీయ ఎజెండా ప్రచారం కోసం వినియోగిస్తున్నారని మండిపడ్డారు. పన్నుల్లో రావాల్సిన న్యాయమైన వాటాను రాష్ట్రాలకు కేటాయించకుండా దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసే కుట్రలకు కేంద్రం పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి సహకరిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలు నిధుల కొరతతో అల్లాడుతుంటే, అక్రమంగా వసూలు చేస్తున్న సెస్సుల ద్వారా సమకూరుతున్న ఆదాయంతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్పురీకి కేటీఆర్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఇంధన ధరల్లో ప్రపంచంలోనే ఖరీదైన దేశాల్లో ఒకటిగా మన దేశం నిలిచిందని విమర్శించారు. భూటాన్, పాకిస్థాన్, శ్రీలంకలో పెట్రో ధరలు భారత్లో కంటే తక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు.
వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1,100 దాటడం ఆడపడుచులకు భారంగా మారిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఉజ్వల యోజన ఒక క్రూరమైన జోక్ అని విమర్శించారు. ఒకప్పుడు ఉజ్వల్ యోజన కింద సిలిండర్లు తీసుకున్న మహిళలు.. పెరిగిన గ్యాస్ ధరలతో మళ్లీ కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారని తెలిపారు. గతంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు 100 డాలర్లు దాటినప్పుడూ.. దేశంలో ఇప్పటితో పోలిస్తే ఇంధన ధరలు తకువగా ఉన్నాయని, ఇప్పుడు క్రూడ్ ధరలు తగ్గినప్పటికీ ప్రజలపై భారం పెంచడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బీజేపీ నేతలు గతంలో పెట్రో ధరలు తగ్గించాలని ఆందోళన చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుతో పేదల జేబులు ఖాళీ అవుతుండగా, ఆయిల్ కంపెనీల గల్లా పెట్టెల్లోకి రూ.వేల కోట్లు చేరుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ధరలు స్థిరంగా ఉంచి, ఓట్ల పండుగ అయిపోగానే పెంచడం ప్రజలను వంచించడమేనని దుయ్యబట్టారు. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అనే కేంద్ర ప్రభుత్వ నినాదం ‘మాక్సిమం ట్యాక్సేషన్.. మినిమం రిలీఫ్’గా మారిందని విమర్శించారు. ప్రధాని చెప్పిన ‘అచ్చేదిన్’ అంటే ఈఎంఐలు కట్టలేని విధంగా, ఇంధన బిల్లుల భారం భరించలేని విధంగా మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టడమేనా? అని ప్రశ్నించారు. సిలిండర్ తెచ్చుకోవాలా?, సరుకులు కొనుకోవాలా? అనే మీమాంసలో పేదలు ఉండిపోవడం, రాష్ట్రాలు తమ స్వయంప్రతిపత్తిని కోల్పోవడమేనా? అని నిలదీశారు.
దేశ ప్రజల తరఫున రాసిన బహిరంగ లేఖలో కొన్ని డిమాండ్లను కేటీఆర్ కేంద్రమంత్రి ముందుంచారు. ఇంధన ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని, కేంద్ర ఎక్సైజ్ సుంకాలను గణనీయంగా తగ్గించి, రాష్ట్రాలకు ఇవ్వని సెస్లను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ క్రూడ్ ధరలకు అనుగుణంగా పారదర్శక ధరల విధానం అమలు చేయాలని కోరారు. ఇంధన పన్నులు, సెస్ వినియోగం, ఆదాయ వాటా వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని, ఆర్థిక కేంద్రీకరణ విధానాలను వీడి, నిజమైన సహకార ఫెడరలిజాన్ని పునరుద్ధరించాలని సూచించారు. దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం కేంద్రప్రభుత్వానికి వచ్చిందని హితవు పలికారు. ఆకట్టుకునే నినాదాల వెనుక దాకోవడం మాని, అసలైన పనిచేయాలని కేంద్రానికి సూచించారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మాజీ మంత్రి కేటీఆర్తో పాటు ఎమ్మెల్యే ముఠాగోపాల్పై దాఖలైన కేసును నాంపల్లి కోర్టు జడ్జి శ్రీదేవి బుధవారం కొట్టివేశారు. అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారంటూ ముషీరాబాద్ పోలీస్స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది.