హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): సీపీఐ సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావును ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పరామర్శించారు. రెండు వారాలుగా అస్వస్థతతో హైదరాబాద్లోని కిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న నాగేశ్వరరావును కేటీఆర్ మంగళవారం పరామర్శించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు.
కేటీఆర్ను చూసి నాగేశ్వరరావు భావోద్వేగానికి లోనయ్యారు. నాగేశ్వర్రావు ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నాగేశ్వరరావు త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాక్షించారు. కేటీఆర్ వెంట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు.