మహబూబ్ నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లను ( BRS Corporators ) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) అభినందించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. నగర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేయాలని సందర్భంగా విజేతలకు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిం చాలని కోరారు. పార్టీ అన్నివిధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు.