ఐటీ, బీటీపై దృష్టి పెడదాం
హలాల్, హిజాబ్పై కాదు
ఐటీ మంత్రి కేటీఆర్, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్
ఆసక్తికర ట్వీట్స్
హైదరాబాద్, ఏప్రిల్ 4 : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ట్విట్టర్లో ఆసక్తికర ట్వీట్లు నడిచాయి. తొలుత బెంగళూరులో సరైన రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా లేక ఇబ్బంది పడుతున్నామని, తమకు సహాయం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ, కర్ణాటక బీజేపీ, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్యను ఉద్దేశించి ఖాతాబుక్ సీఈవో, హౌసింగ్.కామ్ సీవోవో రావిశ్ నరేశ్ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ‘మీ బ్యాగ్లు సర్దుకొని హైదరాబాద్కు రండి! మా దగ్గర భౌతికంగా, సామాజికంగా మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
మా ప్రభుత్వం ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్ అనే మూడు ‘ఐ’లపై దృష్టిసారించింద’ని ట్వీట్ చేశారు. దీనిపై డీకే శివకుమార్ స్పందిస్తూ.. ‘మై ఫ్రెండ్ కేటీఆర్.. మీ చాలెంజ్ను స్వీకరిస్తున్నా. 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో వస్తుంది. భారతదేశ అత్యుత్తమ నగరంగా బెంగళూరుకు పూర్వవైభవం తీసుకొస్తామ’ని ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘శివకుమార్ అన్నా.. కర్ణాటక రాజకీయాల గురించి నాకు అంతగా తెలియదు. అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేను. మీరు విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నా. దేశానికి సౌభాగ్యం, యువతకు ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్, బెంగళూరు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ అండ్ బీటీ (బిజినెస్ టెక్నాలజీ)పై దృష్టి పెడు దాం. హలాల్, హిజాబ్ లాంటి అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరంలేదు’ అని పేర్కొన్నారు.
కర్ణాటక పరిణామాలు అవమానకరం
కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు భారతీయులకు అవమానకరమని మంత్రి కేటీఆర్ మరో ట్వీట్లో ఆవేదన వ్యక్తంచేశారు. శ్రుతి చతుర్వేది అనే నెటిజన్ ట్వీట్కు ఆయన స్పందించారు. ‘బెంగళూరు కేంద్రంగా వ్యాపారం చేస్తున్న ఇద్దరు ముస్లిం వ్యవస్థాపకుల్లో ఒకరు దుబాయ్కి, మరొకరు సింగపూర్కు వారి మొత్తం టీమ్లతో కలిసి తరలివెళ్తున్నారు. అస్థిరమైన నిబంధనలు, కర్ణాటకలో పెరుగుతున్న మత విద్వేషమే ఇందుకు కారణం. భారతదేశం ఆదాయా న్ని మాత్రమే కాదు ఇంకా చాలా కోల్పోతున్నది’ అని శ్రుతి చతుర్వేది పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ స్పం దిస్తూ.. ‘బెంగళూరుది వింత, విచారకర పరిస్థితి! కర్ణాటక నుంచి కొందరు బీజేపీ నాయకులు వచ్చి తె లంగాణలో ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు ఉపన్యాసాలు ఇస్తారు’ అని ఎద్దేవా చేశారు. అక్కడి పరిణామాలు పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశ ఖ్యాతిని నాశనం చేస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు.
బెంగళూరు కేంద్రంగా వ్యాపారం చేస్తున్న ఇద్దరు ముస్లిం వ్యవస్థాపకుల్లో ఒకరు దుబాయ్కి, మరొకరు సింగపూర్కు వారి మొత్తం టీమ్లతో కలిసి తరలివెళ్తున్నారు. అస్థిరమైన నిబంధనలు, కర్ణాటకలో పెరుగుతున్న మత విద్వేషమే ఇందుకు కారణం. భారతదేశం ఆదాయాన్ని మాత్రమే కాదు, ఇంకా చాలా కోల్పోతున్నది.
-శ్రుతి చతుర్వేది, నెటిజన్
మై ఫ్రెండ్ కేటీఆర్.. మీ చాలెంజ్ను స్వీకరిస్తున్నా. 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో వస్తుంది. భారతదేశ అత్యుత్తమ నగరంగా బెంగళూరుకు పూర్వవైభవం తీసుకొస్తాం. -ట్విట్టర్లో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్
శివకుమార్ అన్నా.. కర్ణాటక రాజకీయాల గురించి నాకు అంతగా తెలియదు. అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేను. మీరు విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నా. దేశానికి సౌభాగ్యం, యువతకు ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్, బెంగళూరు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ అండ్ బీటీ (బిజినెస్ టెక్నాలజీ)పై దృష్టి పెడుదాం. హలాల్, హిజబ్ లాంటి అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరంలేదు.
–ట్విట్టర్లో మంత్రి కేటీఆర్