వచ్చే వారంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానున్నట్లు సమాచారం. యాసంగి సీజన్ సాగు, తాగునీటి అవసారలపై ఈ కమిటీలో అధికారులు చర్చించనున్నారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల నీటి అవసరాలను వివరించాలని లేఖలు అందాయి.
ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కేఆర్ఎంబీ లేఖలు పంపింది. ఈ సమావేశంలో రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చలు జరిపిన అనంతరం.. ఎన్ని నీళ్లను విడుదల చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.