హైదరాబాద్, అక్టోబర్4 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం గురువారం జరుగాల్సి ఉండగా, రేపటి (శుక్రవారం)కి వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖలు రాసింది.
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి అంశంపై త్రిసభ్య సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 6న సమావేశాన్ని నిర్వహించనున్నట్టు బోర్డు వెల్లడించింది. ఇరు రాష్ర్టాలు గడచిన ఐదేండ్లలో ఉమ్మడి రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలకు సంబంధించిన డేటాను అందించాలని సూచించింది.