హైదరాబాద్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): కొండగట్టు ఆంజనేయస్వామి జాతర పర్వవేక్షణాధికారిగా ఆలయ ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్ను నియమించినట్లు దేవాదాయ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి చిన్న జయంత్యుత్సవాలు నేటి నుంచి 24వ తేదీవరకు జరగనున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.