హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల్లో బీసీలకు అన్ని పార్టీలు 50% టికెట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో తమవారికి సీట్లు కేటాయించని పార్టీలను ఓడిస్తామని హెచ్చరించింది.
శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు బీసీలకు 20% టికెట్లు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం వరింగ్ ప్రెసిడెంట్గా కే రామరాజువర్మను నియమించారు.