హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): కృష్ణానదీ జలవివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (కేడీవీటీ-2) ముందు తెలంగాణ, ఏపీ వాదనలు శుక్రవారం కొనసాగాయి. ఆపరేషన్ ప్రొటోకాల్పై జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్లో తెలంగాణ తరఫున సాగునీటి రంగ నిపుణులు చేతన్ పండిట్ హాజరయ్యారు. ఏపీ తరఫున సీనియర్ అడ్వకేట్ ఉమాపతి హాజరయ్యారు. శుక్రవారంతో మూడు రోజుల విచారణ పూర్తయింది. తదుపరి సెషన్ వచ్చే నెల 22,23,24 తేదీల్లో జరుగనున్నది.