Vanama | భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హెచ్చరించారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిన్నమొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉండి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రి అజయ్కుమార్ను విమర్శించడం హేయమన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనుక నడుస్తూ జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతున్నారన్నారు.
అనవసరంగా అవాకులు చెవాకులు పేలితే సహించబోమని హెచ్చరించారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. జడ్పీ చైర్మన్గా కోరం కనకయ్య రాజీనామా చేయాలన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జేవీఎస్ చౌదరి, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, ఎంపీపీ శాంతి పాల్గొన్నారు.