హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన కొత్త ప్రభాకర్రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. బుధవారం బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా గెలిచినందుకు కొత్త ప్రభాకర్రెడ్డిని స్పీకర్ శాలువా కప్పి సత్కరించి, అభినందించారు.