హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): నెల్లూరు రూరల్ వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లో చేరే విషయమై ఆలోచిస్తున్నారని తెలిసింది. బీఆర్ఎస్లో ఇప్పటికే ఏపీ ముఖ్య నేతలు ఎందరో చేరడంతోపాటు అక్కడ రాజకీయ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీంతో బీఆర్ఎస్లో చేరే విషయమై కోటంరెడ్డి తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. నెల్లూరు రూరల్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సెటిలర్లు ఉండటంతో బీఆర్ఎస్లో చేరడమే శ్రేయస్కరమనే భావిస్తున్నట్టు సమాచారం.
ఆయన మొదట టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ పరిణామాలెలా జరిగాయో కానీ బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తన సన్నిహితుల వద్ద కుండబద్దలు కొట్టారని సమాచారం. వైసీపీకి మరో 15 నెలలు మాత్ర మే రాష్ట్రంలో అధికారం ఉందని గుర్తుచేశారు. టీడీపీలో చేరితే వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తానని చెప్పారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీలో చేరే విషయమై ఆలోచిస్తానని చెప్పారు.