హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ)/న్యూశాయంపేట: తెలంగాణ వైతాళికుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 9వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సమాజం ఆయనకు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించింది. జీహెచ్ఎంసీపై సమీక్ష సందర్భంగా మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి తదితరులు బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సాంస్కృతిశాఖ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమం లో మంత్రి శ్రీనివాస్గౌడ్, కొండాకు ఘనం గా నివాళులర్పించారు. నిఖార్సైన తెలంగాణవాదిగా శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. బీసీ కమిషన్ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్, బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు. బాపూజీ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారన్నారు. కార్యక్రమం లో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కే కిశోర్గౌడ్, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ కే అలోక్కుమార్, రజక ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. హనుమకొండ హంటర్రోడ్డులోని ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్టు భవన్లో బాపూజీ విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి నివాళులర్పించారు.