కొత్తకోట, ఏప్రిల్ 4 : ఏఐసీసీ అగ్రనేత మల్లికార్జున్ఖర్గే, సీఎం రేవంత్రెడ్డి మాదిగ జాతి ద్రోహులని ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా నేతలు కొమ్ము చెన్నకేశవులు, కిరణ్మాదిగ విమర్శించారు. ఎంపీ టికెట్ల కేటాయింపులో మాదిగలకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. గురువారం కొత్తకోట పట్టణంలోని చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలను రాష్ట్రంలో అడుగడునా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మాలలతో కుమ్మకై మాదిగలను రాజకీయంగా అణచివేయాలని రేవంత్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంపీ ఎన్నికల్లో హస్తం పార్టీని భూస్థాపితం చేయాలని కోరారు.