Munugode by poll Results | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి. ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి రాజగోపాల్ రాజకీయ జీవితం ముగిసినట్టేనా? అని నెటిజన్లు ప్రశ్నించుకుంటున్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పదేపదే వ్యాఖ్యానించిన రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? లేక మాట తప్పుతారా? అనేది వేచి చూడాల్సిందే.
రాజగోపాల్ రెడ్డి ఏం వ్యాఖ్యానించారంటే.. కేసీఆర్ గారు మునుగోడులో గెలిస్తే దేనికైనా రెడీ. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. నేను చెప్తున్నా. మీరు ఎన్నైనా చెప్పండి. మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. నేను ఏ పదవి తీసుకోను. నేను ప్రజల కోసం వచ్చానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.