ప్రశాంత్నగర్, జనవరి 11 : రాష్ట్రంలోనే కోమటి చెరువు టూరిజం స్పాట్గా మారింది. సిద్దిపేట అభివృద్ధిపై యావత్తు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. స్వయంగా సిద్దిపేట అభివృద్ధిని పరిశీలించడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
మంగళవారం సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువును ఎమ్మెల్యే బాల్కసుమన్ సందర్శించారు. అలాగే నెక్లెస్రోడ్ను పరిశీలించారు. సస్పెన్షన్ బ్రిడ్జి పై నడుస్తూ కోమటి చెరువు అందాలను ఆస్వాదించారు. ఐలవ్ సిద్దిపేట సింబల్ వద్ద ఫొటో దిగారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు చేసిన పనులు ప్రత్యక్షంగా కనబడుతున్నాయని, ఇక్కడ జరిగిన అభివృద్ధి చాలా బాగుందన్నారు. కోమటి చెరువు రాష్ట్రంలోనే టూరిజం స్పాట్గా మారిందన్నారు.
ఇక్కడ అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని మా ప్రాంతాల్లో చేపడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ మహేశ్, హార్టికల్చర్ అధికారి ఐలయ్య తదితరులు ఉన్నారు.