హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. మంగళవారం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఎమ్మెల్యే కాలనీలోని నివాసంలో తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు. శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలోని నక్షత్రవనంలో ఈవో పెద్దిరాజులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్కుమార్ కృషి ప్రశంసనీయమని అన్నారు.