పెద్దపెల్లి : జిల్లాలోని సుల్తానాబాద్ మండలం రేగడి మద్ది కుంట గ్రామ శివారులో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం దేశానికే స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషన్ సత్యనారాయణ,పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, డీసీపీ రవీందర్ పాల్గొన్నారు.