హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోహెడలో నిర్మించనున్న మార్కెట్ను దేశంలోనే నంబర్ వన్ మార్కెట్గా తీర్చిదిద్దుతామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. నిర్మాణానికి సంబంధించిన పూర్తి ప్రణాళిక సిద్ధమైందని, త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఆదివారం ఆయన మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. 99 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మారెట్ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. మారెట్ ఆవరణలో గోదాములు, లాజిస్టిక్ పార్, ప్రాసెసింగ్ ప్లాంట్, వ్యర్థాల నిర్వహణ, రీ సైక్లింగ్, సోలార్ సిస్టమ్, కోల్డ్స్టోరేజీ గోదాములు, పండ్లను మగ్గబెట్టే చాంబర్లు, కార్మికులు, సిబ్బందికి క్వార్టర్లను నిర్మిస్తామని వివరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎగుమతులకు అనుగుణంగా సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. ముఖ్యంగా మామిడి ఎగుమతుల కోసం ప్రత్యేకంగా వేపర్ హీట్ ట్రీట్మెంట్ ఇర్రాడియేషన్ ప్లాంట్, కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెటింగ్శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఏడీ లక్ష్మణుడు, కార్యదర్శి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.