హయత్నగర్, జూన్ 2 : నార్ముల్ మదర్ డెయిరీ నూతన మేనేజింగ్ డైరెక్టర్గా కోదండపాణిని నియమిస్తూ ఎన్డీడీబీ చైర్మన్ డాక్టర్ మీనేష్షా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్డీడీబీలో జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న కోదండపాణి.. నార్ముల్ మదర్ డెయిరీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు చేపట్టిన కోదండపాణిని నార్ముల్ మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి శాలువాకప్పి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.