Kodali Nani | తెలుగు దేశం పార్టీపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడితో పాటు జనసేన-బీజేపీ పొత్తుపై తనదైన శైలిలో విమర్శలు గుర్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన, బీజేపీ పోటీ చేస్తే.. జనసేన పరిస్థితి ఏంటో చూశామన్నారు. ఏపీలోని తెలుగుదేశం, జనసేన పోటీ చేస్తే మళ్లీ జనసేన పరిస్థితి అదేనంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయకుడు అధికారం కోసం కాకుండా.. ప్రతిపక్షం కోసం జనసేనను కలుపుకున్నాడన్నారు.
ఎమ్మెల్యే అవ్వాలంటే టీడీపీతో కలవాలని పవన్ కల్యాణ్ అంటుకుంటున్నాడని విమర్శించారు. పవన్ ఎమ్మెల్యేగా గెలిచేందుకు పవన్.. ప్రతిపక్షం కోసమే చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారన్న కొడాలి నాని.. ఇద్దరు కలిసినా జగన్ వెంట్రుక సైతం పీలకలేరంటూ ధ్వజమెత్తారు. జగన్ సింహంలా సింగిల్గా వస్తాడని.. చంద్రబాబు పెద్ద 420 అని.. ఆయన అధికారంలోకి రావడం కలన్నారు. లారీ కింద దూరిన కుక్కకు.. టీడీపీ వాళ్లకు తేడా లేదని విమర్శించారు.
రేవంత్ తెలంగాణలో గెలిస్తే.. ఏపీలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. గెలిస్తే తమ వారని, ఓడితే తమకు సంబంధం లేదని చెప్పటం టీడీపీ అలవాటేనన్నారు. హైదరాబాద్లో సెటిలర్తో ఓట్లు వేయించి.. కేసీఆర్ను ఓడిస్తమని చెప్పారని.. హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటైనా గెలిచిందా అని ప్రశ్నించారు. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచిందని పేర్కొన్నారు. సిగ్గు లేకుండా గాంధీ భవన్కు టీడీపీ జెండాలతో వెళ్లి గంతులేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ పెట్టారన్న నాని.. ఆ పార్టీ జెండాలను తీసుకుని చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ వెధవలు గాంధీభవన్కు వెళ్లారంటూ ధ్వజమెత్తారు. నా శిష్యులు ముఖ్యమంత్రులు అవుతున్నారు.. నేను ఇలా అయ్యాను ఎంటీ ? అని చంద్రబాబు ఏడుస్తున్నాడరని విమర్శించారు. చంద్రబాబులా పాలన చేస్తే ఒకసారి మాత్రమే అధికారంలోకి వస్తారని.. కేసీఆర్ రెండుసార్లు సీఎంగా పని చేశారని గుర్తుంచుకోవాలన్నారు.