KNRUHS | ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్లకు భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ ఒకటి ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులు పరిశీలించి.. అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఇతర వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ knruhs.telangana.gov.inలో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.