హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కేంద్రమంత్రి కిషన్రెడ్డి మరో అబద్ధాన్ని వల్లెవేశారు. కేంద్రం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్-ఆయిల్పాం(ఎన్ఎంఈవో-ఓపీ) కింద రెండేండ్లలో దేశవ్యాప్తంగా రూ.160 కోట్లు ఖర్చు చేస్తే, కిషన్రెడ్డి రూ. 11,040 కోట్లని ట్వీట్ చేయడంపై బీఆర్ఎస్ మండిపడింది. ‘రూ.11,040 కోట్లతో కేంద్రం ప్రారంభించిన ఎన్ఎంఈ-ఓపీ తెలంగాణ రైతులకు ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది’ అని ట్వీట్ చేశారు. ‘ఎగవెట్టెటోని ఇల్లెక్కడ అంటే ఊరవతల’ అన్నట్టుగా రూ. 11,040 కోట్ల ఖర్చు చేసేందుకు 138 ఏండ్లు పడుతుంది’ అని బీఆర్ఎస్ మండిపడింది.