హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలతో బేరసారాల విషయంలో వివరణ కోరేందుకు ప్రయత్నించిన మీడియాపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి చిందులు తొక్కారు. ‘ఏ పార్టీలో ఉండాలనేది వాళ్ల ఇష్టం. పోలీసులకు అక్కడేం పని.. వాళ్లని ఎందుకు అరెస్ట్ చేస్తారు’ అంటూ పోలీసుల తీరును కిషన్రెడ్డి తప్పుబట్టారు.
అంటే బ్రోకర్లు చేసింది కరెక్టేనన్నట్టుగా కిషన్రెడ్డి మాట్లాడారు. నందు మీ అనుచరుడేనా? అని అడిగితే ‘నేను రోజుకో ప్రారంభోత్సవానికి వెళ్తా.. ఫొటోలు దిగుతా.. మీరు ఓపెనింగ్కు పిలిచినా వస్తా .. అయినంత మాత్రాన మీరేం చేసినా నేనెలా బాధ్యుడినవుతాను’ అంటూ చిర్రుబుర్రులాడారు.