BJP | సంగారెడ్డి, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): సంగారెడ్డిలో బీజేపీ సోమవారం నిర్వహించిన విజయ సంకల్ప సభకు జనం రాకపోవడంతో సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. బీజేపీ హేమాహేమీలైన కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల, బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సభకు వచ్చినా ప్రజలు మాత్రం రాలేదు. బీజేపీకి జనంలో రోజురోజుకు ఆదరణ తగ్గుతున్నదనేదానికి ఈ విజయసంకల్ప సభ అద్దం పడుతున్నది. సదాశివపేట పట్టణానికి చెందిన కౌన్సిలర్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడిరాజు బీజేపీలో చేరారు. అయితే.. సభలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాలా అసంతృప్తికి గురయ్యారు. జిల్లా నేతలపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.