హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 53లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యంతోనే రాష్ట్రంలో రైతులు రోడ్లపై ఆందోళన బాట పట్టినట్టు తెలిపారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కిషన్ రెడ్డి కేంద్ర ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు.